ఈనెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు భేటీ కానున్నారు.

ఈనెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్రజా భవన్ లో భేటీ అవ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతకుమారి మరికొద్ది సేపట్లో ప్రజా భవన్ ను పరిశీలించనున్నారు. భేటీకి ప్రజా భవన్‌ను వేదికగా ఎంపిక చేసిన‌ నేపథ్యంలో పరిశీలించ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

వేదికకు కావాల్సిన ఏర్పాట్లు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ నేపథ్యంలో సెక్యూరిటీ తదితరు అంశాలపై సమీక్ష చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. భేటీ జరుగుతున్న సమయంలో ప్రజాభవన్‌కు చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత పెంపు.. విజిటర్స్ నో ఎంట్రీ వంటి ఆంక్ష‌లు విధింపుపై చ‌ర్చించ‌నున్నారు. ముఖ్యమంత్రుల భేటీతో రెండు తెలుగు రాష్ట్రాల‌ విభజన స‌మ‌స్య‌లు కొలిక్కి వస్తాయని చర్చ జ‌రుగుతుంది.

Eha Tv

Eha Tv

Next Story