పొరుగు రాష్ట్రంలో ఉంటూ, ఏపీలో రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు రాష్ట్రానికి అవసరం లేదని

రాజమండ్రి సిటిలో జరిగిన సిద్ధం సభలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి మార్గాని హెచ్చరికలు చేసారు. మహిళా వాలంటీర్‌ను బెదిరించారని ఆడియో వినిపించి మరీ చెప్పు చూపించారు. ఓ మహిళా వాలంటీర్‌ను ఆదిరెడ్డి అప్పారావు బెదిరించినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో పాల్గొన్న ఎంపీ మార్గాని భరత్ అప్పారావుపై మండిపడ్డారు. బహిరంగ సభలోనే దీనికి సంబంధించిన ఆడియోను వినిపించారు. వాలంటీర్లను ఇలా బెదిరించేవారికి చెప్పు చూపిద్దామని అన్నారు. వాలంటీర్ చెల్లెమ్మను బెదిరించిన వాడిని ఏం చేయాలి.. చెప్పు తీద్దామా.. అని అక్కడే ఉన్న ప్రజలను ఉద్దేశించి మార్గాని భరత్ వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లకు ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇవ్వడం మగతనం కాదన్నారు. నా వాలంటీర్ అక్కచెల్లెళ్లను, అన్నదమ్ముళ్లను సొంత తోబుట్టువుల్లాగా చూసుకుంటానని.. మేమేమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదన్నారు. నా వాలంటీర్లు, నా రాజమండ్రి ప్రజల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు భరత్.

పొరుగు రాష్ట్రంలో ఉంటూ, ఏపీలో రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు రాష్ట్రానికి అవసరం లేదని భరత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో దగాకోరు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని.. టీడీపీ, జనసేన నేతల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని తెలిపారు.

Updated On 4 March 2024 10:20 PM GMT
Yagnik

Yagnik

Next Story