నేను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుందని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే(MLA RK) అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి(YCP) నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసు అని అన్నారు. తాను సర్వస్వం పోగొట్టుకున్నానని వాపోయారు. నేను వైఎస్ఆర్(YSR) కుటుంబానికి చెందిన వ్యక్తిన‌ని.. తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తాన‌న్నారు. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానని స్ప‌ష్టం చేశారు. నేను షర్మిలను కలిశాను.. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా.. అప్పుడు నా నిర్ణయం ఉంటుందన్నారు.

నేను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుందని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే(MLA Rama Krishna) అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి(YCP) నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసు అని అన్నారు. తాను సర్వస్వం పోగొట్టుకున్నానని వాపోయారు. నేను వైఎస్ఆర్(YSR) కుటుంబానికి చెందిన వ్యక్తిన‌ని.. తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తాన‌న్నారు. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానని స్ప‌ష్టం చేశారు. నేను షర్మిలను కలిశాను.. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా.. అప్పుడు నా నిర్ణయం ఉంటుందన్నారు.

వైసీపీకి సిద్దాంతాలు ఉండాలన్నారు. ఎంచుకున్న అభ్యర్థులను ఒడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలి. మంగళగిరి(Mangalgiri) ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారని.. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానన్నారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదన్నారు. కాంట్రాక్టర్లు నాపై ఒత్తిడి తెస్తే.. స్వయంగా నేనే 8 కోట్ల వరకూ బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని పేర్కొన్నారు.

నా సొంత డబ్బుతో ఎంటీఎంసీ, దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేసామని వెల్ల‌డించారు. లోకేష్ ను ఓడించిన నాకు సహకారం అందించకపోతే ఎలా అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. నేను ఎవరిని నిందించడం లేదు. నాకు ధనుంజయ రెడ్డి(Dhanunjay) చాలా సార్లు మేసేజీలు పెట్టారు.. నిధులు మంజూరు చేస్తానని.. ఎన్నికలు దగ్గరకు వచ్చాయి.. ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారని ప్ర‌శ్నించారు. రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అన్నారు. నేను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చాను. మంగళగిరి ప్రజలకు నేను దూరంగా ఉండనన్నారు.

ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. నేను ఏ పార్టీలో చేరినా ఆరోజు నా నిర్ణయం చెప్తాన‌న్నారు. ఉంటే వైసీపీలో ఉంటాను అని చెప్పా.. ఇప్పుడు వైసీపీని వీడాను. నేను చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలన్నారు. చాలా మంది నన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించారని.. నేను వైఎస్ కుటుంబంతోనే ఉన్నాను.. ఉంటానని చెప్పాన‌న్నారు. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తాన‌న్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకొనన్నారు.

రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నా.. షర్మిల కాంగ్రెస్‌కు వచ్చినా నా పోరాటం ఆగదన్నారు. సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పా అని ప్ర‌శ్నించారు. తప్పు ఎవ్వరూ చేసినా తప్పేన‌న్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడనన్నారు. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయ స్థానాలు తెలుస్తాయన్నారు. నేను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదన్నారు. నాకు జగన్ టికెట్ ఇవ్వలేదని.. నేను పార్టీని వీడలేదని వివ‌రించారు. నాకు, చిరంజీవికి ,జగన్ కి మధ్య ఏమి జరిగింది అనేది మా అందరికీ తెలుసన్నారు. నేను టికెట్ లేదని పార్టీని వీడలేదన్నారు.

Updated On 30 Dec 2023 5:35 AM GMT
Ehatv

Ehatv

Next Story