వరద బాధితులను(Flood victim) పరామర్శించేందుకు పిఠాపురం(Pithapuram) వెళ్లిన మాజీ సీఎం జగన్‌కు(YS Jagan) అపూర్వ స్వాగతం లభించింది.

వరద బాధితులను(Flood victim) పరామర్శించేందుకు పిఠాపురం(Pithapuram) వెళ్లిన మాజీ సీఎం జగన్‌కు(YS Jagan) అపూర్వ స్వాగతం లభించింది. జగన్‌ వద్దకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు దూసుకొచ్చారు. వరద బాధితులను జగన్‌ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఏలేరు వరద ముంపుతో కుళ్లిపోయిన వరి కంకులతో కన్నీరు పెట్టుకుంటూ ఎదురొచ్చిన రైతుల కష్టాలు తెలుసుకున్నారు. రైతుల్లో మనో ధైర్యాన్ని కల్పించారు. పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో రైతులు, బాధితులను పరామర్శించి తాను ఉన్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. బాధితులు, రైతులను జగన్‌ అక్కున చేర్చుకున్నారు. ఉదయం 10.30 గంటలకు పిఠాపురం వచ్చిన ఆయనకు బాధితులు, రైతులు దారి పొడవునా నిలబడి గోడు వెళ్లబోసుకొన్నారు. అయితే ఇక్కడ జగన్‌కు మహేష్‌ బాబు(Mahesh babu flexi) ఫ్యాన్స్‌ మద్దతు తెలిపారు. జగన్, మహేష్‌ పొటోలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ 'జెండలు జతకట్టడమే మీ ఎజెండా' పాటకు డ్యాన్స్‌లు వేస్తూ ఉత్సాహంగా కదిలారు. మహేష్‌బాబు ఫ్యాన్స్‌ వెన్నుదన్నుగా నిలవడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది

Eha Tv

Eha Tv

Next Story