నంద్యాల(Nandhyala) జిల్లా బేతంచెర్ల(Bethancherla) పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర(Mahendra) అనే యువ‌కుడు ఆదివారం మధ్యాహ్నం కాల‌నీ స‌మీపంలో స్నేహితుల‌తో క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్ప‌కూలాడు.

నంద్యాల(Nandhyala) జిల్లా బేతంచెర్ల(Bethancherla) పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర(Mahendra) అనే యువ‌కుడు ఆదివారం మధ్యాహ్నం కాల‌నీ స‌మీపంలో స్నేహితుల‌తో క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్ప‌కూలాడు. యువకుడిని స్నేహితులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. చేతికందివచ్చిన కొడుకు హఠాత్తుగా మృత్యువాత ప‌డ‌టంతో తల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు.

Updated On 14 Aug 2023 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story