బందరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సింహాద్రి చంద్రశేఖర్‌‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కోరారని

అధికార వైసీపీ మరో ఇద్దరు అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సింహాద్రి రమేశ్ ను పార్టీ సమన్వయకర్తలుగా నియమించింది. సీఎం జగన్ ఆదేశాలతో ఈ నియామకం చేపట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఓ ప్రకటన వచ్చింది. అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, మచిలీపట్నం ఎంపీ బరి నుంచి సింహాద్రి రమేశ్ ను ఎన్నికల బరిలో దించుతున్నట్టు వైసీపీ హైకమాండ్ నుంచి కొన్ని రోజుల కిందట ప్రకటన వెలువడింది. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సింహాద్రి చంద్రశేఖర్ విముఖత వ్యక్తం చేయడంతో, అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చేశారు. సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం నుంచి ఎంపీగా, సింహాద్రి రమేశ్ ను అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది.

బందరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సింహాద్రి చంద్రశేఖర్‌‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కోరారని.. పోటీ చేసేందుకు ఆయన అంగీకరించారని పేర్ని నాని వివరించారు. సింహాద్రి చంద్రశేఖర్‌‌ వైద్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశారని.. మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. మచిలీపట్నం ప్రాంతంలో ఆయన్ను చాలా మంది అభిమానిస్తారని పేర్ని నాని తెలిపారు.

Updated On 7 March 2024 8:48 PM GMT
Yagnik

Yagnik

Next Story