కృష్ణాజిల్లా గుడివాడలో నారా చంద్రబాబు రా కదలిరా సభ విజయవంతమైంద‌ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

కృష్ణాజిల్లా(Krishna District) గుడివాడ(Gudivada)లో నారా చంద్రబాబు(Chandrababu) రా కదలిరా సభ విజయవంతమైంద‌ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని, కేశినేని నానిపై ఫైర్ అయ్యారు. రా కదిలిరా సభ విజయవంతంతో వైసీపీ(YSRCP) నేతల్లో వణుకు మొదలైందన్నారు. కానికి చల్లని కాకులు కావు కావు మంటున్నాయని ఎద్దేవా చేశారు. నిన్న గుడివాడ సభ అశేష జన వాహినితో దద్దరిల్లిందన్నారు. అరాచక ప్రభుత్వాన్ని సాగనంపే దిశగా ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో కృష్ణాజిల్లాలో ఏడుకి ఏడు నియోజకవర్గాలు, పార్ల‌మెంట్ స్థానాలను టీడీపీ(TDP)-జనసేన(Janasena) కైవసం చేసుకొని చంద్రబాబుకి కానుక ఇవ్వబోతున్నామ‌ని తెలిపారు. గతంలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అవినీతితో జిల్లాని సర్వనాశనం చేశారని.. బందరు పోర్టు నిర్మాణం పేరుతో అక్కడ తవ్విన మట్టిని తండ్రి కొడుకులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జగన్(Jagan) అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రోజు విగ్రహావిష్కరణ పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాడని విమ‌ర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ స్మ్రుతి వనాన్ని నిర్మాణం చేపట్టడం కోసం అమరావతిలో 20 ఎకరాల భూమిని కేటాయించామ‌న్నారు.

నీకోసం నువ్వు ఆడిన డ్రామాలో అమాయకుడైన కోడి కత్తి శ్రీను(Kodi Kathi Srinu)కు ఈ రోజుకి బెయిల్ రాకుండా చేశావని ఆరోపించారు. 5 సంవత్సరాలుగా కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టు కి వెళ్ళడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కొడాలి నాని(Kodali Nani) ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, ఎన్టీఆ(NTR)ర్ బిక్ష మీద రాజకీయలోకి వచ్చి ఈరోజు అన్నగారి కుటుంబాన్ని దూషిస్తున్నావని హెచ్చరించారు. తులసివనం లాంటి తెలుగుదేశం పార్టీలో ఒక గంజాయి మొక్కై పెరిగావు. కేశినేనీ నాని(Kesineni Nani) పిచ్చిపిచ్చి వాగుడు వాగుతున్నారు. ఇన్నాళ్లు ఎన్ని తప్పులు చేసినా భరించాం. చంద్రబాబు బీఫార్మ్ ఇస్తేనే నువ్వు ఎంపీ అయ్యావని గుర్తుపెట్టుకోవాల‌న్నారు. మీ పరిధిలో మీరు ప్రవర్తించండి, పరిధి దాటి చంద్రబాబు కోసం లోకేష్ కోసం మాట్లాడారా మర్యాద దక్కదని హెచ్చ‌రించారు.

Updated On 19 Jan 2024 5:12 AM GMT
Yagnik

Yagnik

Next Story