చిల్లర వాగుడు వాగే ప్రశాంత్‌ కిశోర్‌ వంటి వారిని పట్టించుకోవలసిన అవసరం లేదని కొడాలి నాని

కొడాలి నాని జనసేన అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఓడించేది టీడీపీ నేతలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌ వంటి గుంటనక్కలతో పవన్‌ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్నాడని.. ఎప్పుడు ఎవరు ఎలా వెన్నుపోటు పొడుస్తారో చెప్పలేని పరిస్థితి అని కొడాలి నాని తెలిపారు. పవన్‌ కళ్యాణ్ ను కాపాడుకోవాల్సిన అవసరం జనసైనికులు, అభిమానులకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పాతాళానికి తొక్కి, టీడీపీని చిత్తుగా ఓడించాలని జన సైనికులకు కొడాలి నాని పిలుపునిచ్చారు. పవన్‌ను ఓడించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ వ్యూహం పన్నుతున్నారంటూ చంద్రబాబు నాయుడు.. ఆయన అనుకూల మీడియా ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని 175 సీట్లలోనూ వైసీపీ గెలవాలన్నది సీఎం జగన్‌ వ్యూహమని.. అలా ఓడిపోయే వాళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌ కూడా ఉండవచ్చని తెలిపారు.

చిల్లర వాగుడు వాగే ప్రశాంత్‌ కిశోర్‌ వంటి వారిని పట్టించుకోవలసిన అవసరం లేదని కొడాలి నాని అన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలేదని గుర్తు చేశారు. ఐప్యాక్‌ నుంచి తన్ని తరిమేసిన తర్వాత ఏ పార్టీ అతన్ని చేరదీయక పోతే.. బిహార్‌లో సొంత పార్టీ పెట్టి విఫలమయ్యాడని.. చంద్రబాబు లాంటి పనికి మాలిన వ్యక్తుల వద్ద ప్యాకేజ్‌ తీసుకుని జ్యోతిష్యం చెపుతున్నాడని విమర్శించారు.

Updated On 4 March 2024 9:48 PM GMT
Yagnik

Yagnik

Next Story