సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలని సూచించారు. మంచి చేస్తేనే ఓటేయమని

వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని తెలుగుదేశం పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేశాడని.. జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికలకు వాడుకుని వదిలేశారన్నారు. ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడని.. అయినా కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు నాయుడుని గొయ్యి తీసి పాతిపెట్టాలన్నారు. అలాంటప్పుడే టీడీపీ బతికి బట్టగడుతుందని కొడాలి నాని తెలిపారు.

సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలని సూచించారు. మంచి చేస్తేనే ఓటేయమని సీఎం జగన్ ఎంతో దమ్ముగా అడుగుతున్నారని.. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలని ప్రజలను కోరారు కొడాలి నాని. సీఎం జగన్ ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అడ్డుకుని తీరుతారని.. మీ కోసం 120 సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం రెండు బటన్‌లు నొక్కండని ప్రజలను కోరారు. ఈ సారికి చంద్రముఖిని ఈవీఎంలలో బంధించండని.. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందని కొడాలి నాని అన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేసారు.

Updated On 6 March 2024 12:10 AM GMT
Yagnik

Yagnik

Next Story