గతంలో టీడీపీ చేసిందేమీ లేదు. ఇప్పుడు చేస్తామన్నా టీడీపీ ఎవరూ నమ్మడం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి మాడు పగిలిపోయేలా ప్రజలు తీర్పును ఇవ్వబోతున్నారని కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేదల మద్దతు ఉందని.. ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో టీడీపీ చేసిందేమీ లేదు. ఇప్పుడు చేస్తామన్నా టీడీపీ ఎవరూ నమ్మడం లేదన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు టీడీపీ నేతలే మద్దతిచ్చారని.. మంచి చట్టమని పయ్యావుల కేశవ్‌ చెప్పారని.. ఇప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్ధపు ‍ప్రచారం చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకాలకు డబ్బులు పడకుండా కూటమి అడ్డుకుందని ఆరోపించారు. చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలని.. పప్పు లోకేష్ మంగళగిరిలో కూడా గెలవడని జోస్యం చెప్పారు. చంద్రబాబును ఈ రాష్ట్రం నుంచి సాగనంపడానికే ఈ ఎన్నికలని కొడాలి నాని అన్నారు.

Updated On 9 May 2024 9:54 PM GMT
Yagnik

Yagnik

Next Story