ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ చంద్రబాబుతో భేటీ అయిన నేప‌థ్యంలో ఐ-పాక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kisor) చంద్రబాబు(Chandrababu)తో భేటీ అయిన నేప‌థ్యంలో ఐ-పాక్(I-PAC) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్(YS Jagan) గెలుపు కోసం తాము పనిచేస్తున్నట్టు ఐపాక్‌ సంస్థ ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేసింది. ఐపాక్ ఎక్స్‌ వేదికగా..‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మా వంతు తోడ్పాటు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ(YSRCP)తో కలిసి పనిచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో​ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గెలుపుకోసమే మేము పనిచేస్తాం’ అని స్పష్టం చేసింది.

ఇదిలావువుంటే.. శ‌నివారం ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు. వీరు వ‌చ్చే ఎన్నిక‌ల‌లో క‌లిసి ప‌నిచేయ‌నున్నారా.. లేదా అనేది స్ప‌ష్ట‌త రావాల్సివుంది.

Updated On 23 Dec 2023 9:53 AM GMT
Yagnik

Yagnik

Next Story