చంద్రబాబు వ్యవహార శైలి ఎలా ఉంటుందో తాను దగ్గర్నుంచి చూశానని కేశినేని నాని అన్నారు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదట స్పెషల్ స్టేటస్ కోసం కాస్త డిమాండ్ చేసినప్పటికీ.. ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ వద్దు.. స్పెషల్ ప్యాకేజీ తీసుకుందామంటూ ప్రజలను నమ్మించాడు. స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ లాభాలు స్పెషల్ ప్యాకేజీ ద్వారానే వస్తాయంటూ చాలా మంది నోరు మూయించేశారు. అప్పట్లో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తెగ తిరిగేవారు. ప్రధాని మోదీతో భేటీ అవుతున్నా కూడా పెద్దగా ఫలితం కనిపించేది కాదు.. అయితే అప్పట్లో చోటు చేసుకున్న ఘటనల గురించి విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు.

చంద్రబాబు వ్యవహార శైలి ఎలా ఉంటుందో తాను దగ్గర్నుంచి చూశానని కేశినేని నాని అన్నారు. చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఇంట్లోంచి బయటికి వచ్చేవాడు. ఇంటి ఎదురుగానే హెలిప్యాడ్ ఉండేది. అక్కడివరకు బుల్లెట్ ప్రూఫ్ కార్లో వచ్చి, హెలిప్యాడ్ లో ఉన్న హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లేవాడు. అక్కడ్నించి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేవాడు. ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి మా రాష్ట్రం పరిస్థితి బాగా లేదు.. డబ్బులు కావాలి అని అడిగేవాడు. చంద్రబాబు ఇటు వెళ్ళగానే ఆయన మాతో ఆయన ఇంటి ముందు హెలికాప్టర్ ఎక్కి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగి, అక్కడ్నించి స్పెషల్ ఫ్లయిట్ ఎక్కి ఇక్కడికి వచ్చి మా రాష్ట్రం పేదది అంటాడేంటి అనేవారు. మమతా బెనర్జీ రబ్బరు చెప్పులు వేసుకుని, రూ.100 చీర కట్టుకుని మామూలు విమానంలో వస్తారు. శాంట్రో కారులో తిరుగుతయారు. వాళ్ల రాష్ట్రం పేదది అంటే ఎవరైనా నమ్ముతారు కానీ, మీ ముఖ్యమంత్రిని చూసి పేద రాష్ట్రం అంటే ఎలా నమ్ముతాం అనేవారని చెప్పారు. చంద్రబాబు నాయుడుది అంతా హైప్... జగన్ మోహన్ రెడ్డిది రియాలిటీ అని కేశినేని నాని అన్నారు.

Updated On 12 Feb 2024 9:23 PM GMT
Yagnik

Yagnik

Next Story