టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు

టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని టీడీపీ నేత సోమి రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. సోమిరెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని, నా పాస్ పోర్ట్ దొరికిందని, గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని చెప్పారని.. ఈ ఆరోపణలన్నిటికీ సమాధానంగా బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధమని అన్నారు. నా పాస్ పోర్ట్ కార్లో దొరికిందని చెప్పారు.. నా పాస్ పోర్ట్ నా దగ్గరే ఉందన్నారు. ఆ కారుతో నాకున్న సంబంధాలను రుజువు చేయమని సవాల్ విసురుతున్నానన్నారు. స్టికర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశా.. వారు విచారణ చేస్తున్నారని వివరించారు. నాతో గోపాల్ రెడ్డికి పరిచయం ఉన్నట్టు ఏ ఆధారం ఉన్నా సోమిరెడ్డి బయట పెట్టాలన్నారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి పార్టీకి సంబంధం లేదని కర్ణాటక పోలీసులు స్పష్టం చేశారని.. కానీ సోమిరెడ్డి మాత్రం నాకు అంటగడుతూ ఉన్నారన్నారు. క్లబ్ కు వెళ్లడం...పేకాట ఆడటం...డ్రగ్స్ అలవాట్లు ఎవరికి ఉన్నాయో తేల్చుకుందామని సవాల్ విసిరారు. మరో మూడు నెల్లూరులో ఉంటా.. దమ్ముంటే సోమిరెడ్డి రావాలన్నారు.

సోమిరెడ్డి చీకటి కోణాలు చాలా ఉన్నాయనే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాలకు అమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Updated On 24 May 2024 2:41 AM GMT
Yagnik

Yagnik

Next Story