ఇప్పుడు కైలే అనిల్ కుమార్ చంద్రబాబుకు సవాల్ విసిరారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పామర్రులో స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు కైలే అనిల్ కుమార్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

చంద్రబాబు ఎంత దిగజారుడు తనానికి.. నా మీద చేసిన ఆరోపణలే నిదర్శనమని అన్నారు. పామర్రులో నేను ఇల్లు కట్టుకున్నానని.. జూబ్లీహిల్స్ లో ఆయన కట్టుకున్న ఇంట్లోని రెండు మెట్లు ఖరీదు కూడా నా ఇల్లు చేయదని అన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 200 గజాల్లో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నానన్నారు. జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో నేను అవినీతికి పాల్పడ్డానని ఒక్కరితో చెప్పించినా రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతాను. చంద్రబాబు పామర్రు వచ్చి ఏమేమో చేశారు.. ఆ రోజున చంద్రబాబు గంటసేపు బస్సులోనే ఎందుకు పడుకున్నారో అడగండన్నారు. చంద్రబాబు సభకు ప్రజలు రాకపోవడంతో ఆయన బస్సులోనే పడుకున్నారని.. ఆ తర్వాత మీటింగ్ కు వచ్చి ఆ ఎండలో, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆరోపించారు కైలే అనిల్ కుమార్.

Updated On 9 April 2024 8:33 PM GMT
Yagnik

Yagnik

Next Story