జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఊహించని

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్ ప్రజాశాంతి పార్టీలో చేరితే సీఎంని చేస్తానని ప్రకటించారు. పవన్ కి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా.. ఎంత డబ్బు కావాలి..? అని కూడా ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన పాల్.. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు పొత్తుతో ఒకే వేదిక మీద ఉన్న అతనిలో బాధ కనపడిందన్నారు. కాపులు జనసేన, టీడీపి పొత్తుని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మికంగా చనిపోతాడని చెప్పాను.. అదే జరిగింది. తెలంగాణలో కేసీఆర్‌ చిత్తుగా ఓడిపోతారు అని చెప్పాను.. అది కూడా జరిగిందన్నారు. ఇప్పుడు దేశంలో రూపాయి విలువ పడిపోయింది.. మోడీ ప్రభుత్వం వచ్చాక అప్పు, నెలకి లక్షా పదివేల కోట్లుకి చేరిందన్నారు. మోదీ తోత్తులు అయిన టీడీపీ, జనసేన పార్టీలని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వైసీపీ సిద్ధం అంటుంది.. టీడీపీ – జనసేన దోచుకోవడానికి సంసిద్ధం అంటుందన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రజాశాంతి పార్టీ, కేఏ పాల్ ఆత్మీయ యుద్ధం అంటున్నారని తెలిపారు.

Updated On 26 Feb 2024 1:08 AM GMT
Yagnik

Yagnik

Next Story