పవన్ కళ్యాణ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో వారాహి విజయభేరి యాత్ర నిర్వహించారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మరోమారు రద్దయింది. అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభ అనంతరం జ్వరం రావడంతో సోమవారం నాడు యలమంచిలి పర్యటనను పవన్ కళ్యాణ్ రద్దుచేసుకున్నారు. పవన్ పర్యటనల సమయంలో తరచూ జ్వరం బారినపడుతూ ఉన్నారు. ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. అయితే అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన అనంతరం పవన్ మళ్లీ జ్వరం బారినపడ్డారు. దీంతో నేటి పర్యటనను రద్దుచేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో వారాహి విజయభేరి యాత్ర నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల సమయం ఉండడంతో జ్వరం నుంచి కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని వేగవంతం చేశారు. గత ఎన్నికల్లో గడ్డుకాలం ఎదుర్కొని.. ఇప్పుడు టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. ఆదివారం అనకాపల్లి లోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల మార్కెట్, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి, నెహ్రూచౌక్ జంక్షన్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తూ పవన్ రోడ్ షోలో పాల్గొన్నారు.

Updated On 8 April 2024 12:14 AM GMT
Yagnik

Yagnik

Next Story