రోజా(Roja) గ్లిజరిన్ పూసుకుని ఏడుస్తోందని జనసేనపార్టీ(Janasena) తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్(Kiran Royal) అన్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుటుంబాన్ని విమర్శించినప్పుడు మా మనోభావాలు దెబ్బతినలేదా..?

రోజా(Roja) గ్లిజరిన్ పూసుకుని ఏడుస్తోందని జనసేనపార్టీ(Janasena) తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్(Kiran Royal) అన్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుటుంబాన్ని విమర్శించినప్పుడు మా మనోభావాలు దెబ్బతినలేదా..? అని ప్ర‌శ్నించారు. రోజాను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నార‌ని అన్నారు. టీడీపీ-జనసేన(TDP-Janasena) అధికారంలోకి వచ్చాక‌.. రోజాకు నిజమైన ఏడుపు చూపిస్తాం అని హెచ్చ‌రించారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై ఉలుకెందుకు..? అని ప్ర‌శ్నించారు. రోజా నీ బాగోతం ఏదో ఉంది కాబట్టే నువ్వు భయపడుతున్నావు.. ఏడుస్తున్నావు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రోజా ఏడుస్తోందని జనం టపాసులు కాల్చాలన్నారు. టీడీపీ-జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక.. రోజాను మూడేళ్ళు జైల్లో కూర్చోబెడతాం అన్నారు.

జోగి రమేష్(Jogi Ramesh) సీఎం సంక నాకుతున్నాడని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. చక్కెర, బియ్యం, జీడిపప్పుతో జోగి.. జగన్ దగ్గరకు వెళుతున్నాడని అన్నారు. పెడనలో వారాహిని అడ్డుకుంటానని జోగి రమేష్ హెచ్చరించడం హాస్యాస్పదం అన్నారు. వారాహిని అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. జోగి రమేష్ గూర్ఖా మంత్రి.. జోగిని మళ్ళీ నేపాల్ కే పంపిస్తామ‌న్నారు. రాంగోపాల్ వర్మ వైసీపీ నాయకుడు.. టీడీపీ-జనసేనను విమర్శించ‌డమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు.

Updated On 4 Oct 2023 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story