జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సక్సెస్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సక్సెస్ ను అందుకున్నారు. కూటమిగా ఏర్పడడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు.

పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఎన్డీయే సమావేశం అనంతరం మోదీతో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాను ప్రధానికి పరిచయం చేశారు. పెద్ద కుమారుడు అకిరా నందన్ కూడా ప్రధాని మోదీని కలిశారు. తన కొడుకు అకీరాను ప్రధాని మోదీకి పరిచయం చేయగా.. మోదీ ఆయన భుజం తట్టారు.

Updated On 6 Jun 2024 6:16 AM GMT
Yagnik

Yagnik

Next Story