జనసేన శాసనసభాపక్ష నేతగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కళ్యాణ్

జనసేన శాసనసభాపక్ష నేతగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జనసేన మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంల పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ భేటీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

జనసేన పార్టీ నుండి పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో అందరినీ గెలిపించుకొని వందశాతం రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారారు. పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజారీటీతో విజయాన్ని అందుకున్నారు.

Updated On 11 Jun 2024 12:01 AM GMT
Yagnik

Yagnik

Next Story