ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోలతో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కిట్‌ల పంపిణీని క్లియర్ చేశారు. గత ప్రభుత్వం యూనిఫామ్‌తో పాటు స్కూల్ బ్యాగ్, జత బూట్లు, పుస్తకాలు, ఇతర స్టేషనరీలతో కూడిన కిట్‌లను పంపిణీ చేసేది. 'జగనన్న విద్యా కానుక' పేరుతో ఈ కిట్‌లను గురువారం నుంచి ప్రారంభం కానున్న ప్రస్తుత విద్యా సంవత్సరానికి సిద్ధంగా ఉంచారు. చంద్రబాబు నాయుడు మరో విధంగా నిర్ణయం తీసుకుని, తన ఛాయాచిత్రంతో కిట్‌లను మళ్లీ తయారు చేయాలనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం వచ్చి ఉండేది.

కొత్త ప్రభుత్వం ఏర్పడి సంబంధిత మంత్రిని నియమించే వరకు ఎదురుచూడకుండా టీటీడీ అధిష్టానం గత ప్రభుత్వానికి సంబంధించిన కిట్ లను పంచడానికి ఆమోదముద్ర వేసింది. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనలో పడేయకూడదని చంద్రబాబు అధికారులకు సూచించారు.

Updated On 11 Jun 2024 9:31 PM GMT
Yagnik

Yagnik

Next Story