భద్రాచలం చేరుకున్న యువకులు శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానంలో రాబోయే

ఆంధ్రప్రదేశ్‌ కు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రెండో దఫా ముఖ్యమంత్రి కావాలంటూ బూర్గంపహాడ్‌ మండలానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున ఆదివారం పాదయాత్ర చేపట్టారు. మండలంలోని లక్ష్మీపురం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాలకు చెందిన యువకులు పాదయాత్ర చేశారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వీరాభిమానులు వీళ్లు.. అలాగే సీఎం జగన్ అంటే కూడా అభిమానం. దాదాపు 150 మంది యువకులు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం నుంచి భద్రాచలం వరకు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు.

భద్రాచలం చేరుకున్న యువకులు శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. జగన్ యూత్ సభ్యులు సానికొమ్ము శంకర్‌రెడ్డి, రమణారెడ్డి, ప్రకాష్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అన్నారు. సీఎం జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు.

Updated On 7 April 2024 9:27 PM GMT
Yagnik

Yagnik

Next Story