తిరుమల(Tirumala) న‌డ‌క‌ మార్గంలో(Steps) విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇంటెలిజెన్స్ డీఎస్పీ(Intelligence DSP) కృపాకర్(Krupakar) హఠాన్మరణం(Death) చెందారు. కృపాకర్ శ్రీవారి మెట్ల(Srivari steps) మార్గంలో చంద్రగిరి(chandragiri) మండలం శ్రీనివాస మంగాపురం(Srinivas Mangapur) వెళుతుండగా ఒక్కసారిగా ఆయ‌న‌ గుండెపోటుకు(Heart attack) గురై కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే కన్నుమూశారు.

తిరుమల(Tirumala) న‌డ‌క‌ మార్గంలో(Steps) విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇంటెలిజెన్స్ డీఎస్పీ(Intelligence DSP) కృపాకర్(Krupakar) హఠాన్మరణం(Death) చెందారు. కృపాకర్ శ్రీవారి మెట్ల(Srivari steps) మార్గంలో చంద్రగిరి(chandragiri) మండలం శ్రీనివాస మంగాపురం(Srinivas Mangapur) వెళుతుండగా ఒక్కసారిగా ఆయ‌న‌ గుండెపోటుకు(Heart attack) గురై కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే కన్నుమూశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు.

మెట్ల దారి గుండా పైకి వెళుతుండగా 1,805 మెట్టు దగ్గర కృపాకర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పితో కుప్పకూలారు. గమనించిన సిబ్బంది వెంటనే ఆయ‌న‌ను ఆసుప‌త్రికి(Hospital) తరలించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయ‌న‌ మార్గమధ్యంలోనే మృతి చెందారు.

డీఎస్పీ కృపాకర్(59) స్వస్థలం విజయవాడ స‌మీపంలోని పోరంకి అని పోలీసులు తెలిపారు. కృపాకర్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు వివరించారు. విషయం తెలుసు కున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కృపాకర్ మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

Updated On 25 Nov 2023 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story