తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షపాతం మరింత ఉధృతంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉన్న అల్పపీడనం నేడు పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్, పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

తెలంగాణలో ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్, పది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. లోతట్టు ప్రాంతాలలో వరద ప్ర‌వాహం, కాలువలు దాటకుండా ఉండాలని సూచించింది.

Eha Tv

Eha Tv

Next Story