గుడివాడకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే కొడాలి నాని(kodali Nani) అన్నారు. గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయిందని అన్నారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరా కొన్నట్లు నిరూపించగలరా..? నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాన‌ని స‌వాల్ విసిరారు. చంద్రబాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశాడ‌ని.. 14 ఏళ్లు చంద్రబాబు(Chandrababu) గుడ్డి గుర్రానికి పళ్లు తోమాడా..? అని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. చంద్రబాబు జిత్తుల మారి నక్క.. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి […]

గుడివాడకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే కొడాలి నాని(kodali Nani) అన్నారు. గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయిందని అన్నారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరా కొన్నట్లు నిరూపించగలరా..? నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాన‌ని స‌వాల్ విసిరారు. చంద్రబాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశాడ‌ని.. 14 ఏళ్లు చంద్రబాబు(Chandrababu) గుడ్డి గుర్రానికి పళ్లు తోమాడా..? అని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. చంద్రబాబు జిత్తుల మారి నక్క.. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. 2014 ఎన్నికల్లో గుడివాడలో చంద్రబాబు మాడు పగలగొట్టారని అన్నారు. పామర్రు ప్రజలు చంద్రబాబును కాలికింద వేసి తొక్కేశారని పేర్కొన్నారు.

ఉన్నతాధికారుల పోస్టుల్లో కులం, మతం చూస్తారా..? అని ప్ర‌శ్నించారు. గుడివాడ(Gudivada)లో 23 వేల మందికి ఇళ్లు ఇస్తున్నామ‌ని తెలిపారు. సభలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారని ఎద్దేవా చేశారు. పాడె ఎక్కే సమయంలో చంద్రబాబు నిమ్మకూరు వెళ్లారని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 42 ఏళ్ల తరువాత చంద్రబాబు అత్తారింటికి వెళ్లి బస్సులో పడుకున్నాడని అన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్‌(NTR), బసవతారకం(Basavatharakam) విగ్రహాలను కూడా చంద్రబాబు పెట్టలేదని.. నేను జూనియ‌ర్ ఎన్టీఆర్‌(Jr NTR) కలిసి విగ్రహాలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

Updated On 14 April 2023 2:20 AM GMT
Yagnik

Yagnik

Next Story