ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు గుడివాడ అమర్నాథ్

మార్చి 5, 7వ తేదీల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. మార్చి 5న విజన్ ఫర్ వైజాగ్ పేరుతో పారిశ్రామిక వేత్తలు సమావేశమవుతున్నారని.. ఈ సమావేశానికి 2000 మంది వరకూ హాజరుకానున్నారని తెలిపారు. 1500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు గుడివాడ అమర్నాథ్. మార్చి 7న సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారని.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అనకాపల్లిలో వైయస్సార్ చేయూత కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నామని వివరించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు సంబంధించిన చేయూత నిధులను విడుదల చేయనున్నారు. అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు జనానికి ఎంతో మేలు చేస్తున్నాయని.. అవే గెలిపిస్తాయని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తెలుగుదేశం-జనసేన పార్టీలకు ప్రజా మద్దతు లేదని తేల్చేశారు.

Updated On 2 March 2024 8:25 PM GMT
Yagnik

Yagnik

Next Story