భార్యపై ముగ్గురు యువకుల అత్యాచారం

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ భర్తను(Husband) చితకబాది భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారం(Rape) చేశారు. ఈ దారుణఘటన ఏలూరు(Ellore) జిల్లాలో జరిగింది. స్థానికంగా ఇది సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఏపీలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి

ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామకోటి(Ramakoti) ప్రాంతంలో ఇది జరిగింది. పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి అతని భార్యతో కలిసి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని పలు హోటళ్లలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే తాము కూడా పనికి వస్తామని ముగ్గురు యువకులు ఈ జంటతో పరిచయం పెంచుకున్నార. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులతో కలిసి బాధితురాలి భర్త మద్యం తాగాడు. భర్తకు అతిగా మాద్యం తాపించిన యువకులు మత్తు ఎక్కిన తర్వాత అతనిని తీవ్రంగా కొట్టారు. విచక్షణారహితంగా గాయపర్చారు. ఆ తర్వాత అతని భార్యపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. తీవ్రగాయాలతో రోడ్డుపైకి వచ్చి స్థానికులను సాయం చేయాలని కోరాడు. 100కు ఫోన్‌ చేసినా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలికి చేరుకొని విచారించారు. పారిపోయిన నిందితులను గాలించి పట్టుకున్నారు. నిందితులు నూతిపల్లి పవన్, నారపాటి నాగేంద్ర, గడ్డి విజయ్‌కుమార్‌గా గుర్తించారు.

Eha Tv

Eha Tv

Next Story