అనంతపురం(Ananthapuram) జిల్లా గార్లదిన్నె(Garladinne) మండలం కల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. తెల్లవారుజామున బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌(Tractor), ప్రైవేట్‌ బస్సు(Private Bus) ఢీకొన్నాయి.

అనంతపురం(Ananthapuram) జిల్లా గార్లదిన్నె(Garladinne) మండలం కల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. తెల్లవారుజామున బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌(Tractor), ప్రైవేట్‌ బస్సు(Private Bus) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్‌లోనే మృతిచెందారు. మృతులు గుత్తి మండలం మామిడూరుకు చెందిన శ్రీరాములు (45), తిప్పయ్య (45), శ్రీనివాసులు (30), నాగార్జున (30)గా గుర్తించారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు(Police) సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ మరో వ్యక్తి నరేష్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో మామిడూరులో విషాదఛాయలు నెలకొన్నాయి.

Updated On 23 Dec 2023 12:49 AM GMT
Ehatv

Ehatv

Next Story