తెలంగాణలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి టి కృష్ణ ప్రసాద్‌ను తెలుగుదేశం పార్టీ బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీకి దింపింది.

తెలంగాణలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి టి కృష్ణ ప్రసాద్‌(Krishna Prasad)ను తెలుగుదేశం(TDP) పార్టీ బాపట్ల(Bapatla) లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీకి దింపింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా సిట్టింగ్ ఎంపీ నందిగాం సురేష్ బ‌రిలో ఉన్నారు.

సీనియర్ ఐపీఎస్ అధికారిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్న కృష్ణ ప్రసాద్ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్‌ను ఎంచుకున్నారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కృష్ణ ప్రసాద్ గుంటూరు పోలీస్ సూపరింటెండెంట్‌గా, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు.

ఆయన తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ హోదాలో రాష్ట్ర రోడ్డు భద్రత అథారిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2017లో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలకు ఆనుకుని ఉన్న యర్రవల్లి గ్రామాన్ని ఆయ‌న‌ దత్తత తీసుకున్నారు.

పదవీ విరమణ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి చాలా కాలం పాటు పార్టీలో పనిచేశారు. ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ కోసం ప్ర‌య‌త్నించారు. అయితే ఆయనకు టిక్కెట్టు దక్కలేదు.

Updated On 22 March 2024 9:41 PM GMT
Yagnik

Yagnik

Next Story