ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై(Chandrababu) మాజీ మంత్రి ఆర్కే రోజా(RK roja) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై(Chandrababu) మాజీ మంత్రి ఆర్కే రోజా(RK roja) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఆత్మస్తుతి పరనింద బాగా అలవాటయ్యిందని, ఈ విషయంలో తన మనా అనే భేదం ఆయనకు లేదని రోజా అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఓ ట్వీట్‌ చేశారు. 'ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించిన మొదటి కలెక్టర్లు ఎస్పీలు మరియు ఉన్నతాధికారుల సమావేశంలో మాది పొలిటికల్ గవర్నెన్స్ మా వారు చెప్పిందే చేయండి అని చెప్పి విచ్చలవిడిగా దందాలకు, అరాచకాలకు ఆధ్యం పోశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి ఆ తప్పులు ఎమ్మెల్యేల మీద నెట్టుతున్నారు.

తన మీడియాతోనే తమ ఎమ్మెల్యేల మీద బురదజల్లి తప్పంతా వారిదే అన్నట్లు ప్రచారం చేయిస్తున్నారు. ఈ మాటున తన తప్పులు, వైఫల్యాలు, కుమారుడు నారా లోకేశ్‌ దందాలను చర్చకు రానివ్వడం లేదు. ఎమ్మెల్యేల అవినీతిపై ఉదయం కథనాలు, చర్చ చేస్తున్న సదరు మీడియానే సాయంత్రం ముఖ్యమంత్రి వీరుడు శూరుడు అంటూ ఎంపిక చేసుకున్న మందిమాగాదులతో చిలకపలుకల మాటలతో రక్తికట్టిస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం. అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఫల్యాలను, తన కుమారుడి దందాలను కప్పిపుచ్చుకోవడానికి తమ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా తన మీడియాతోనే ప్రచారం మొదలెట్టిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఏ కలెక్టర్ల, ఎస్పీల సమావేశంలో తమ తెలుగుదేశం పార్టీ వారు చెప్పిందే చేయాలని చెప్పినట్లు, తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమేనని వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిగారిలా చెప్పాలి' అని రోజా అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story