Tirumala : బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది..!
తిరుపతి అలిపిరి నడకమార్గం ఏడోవ మైలు వద్ద మూడేళ్ల బాలుడుపై గురువారం రాత్రి చిరుత దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీటీడీ, ఫారెస్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

Forest officials caught the leopard that attacked the boy
తిరుపతి(Tirupati) అలిపిరి(Alipiri) నడకమార్గం ఏడోవ మైలు వద్ద మూడేళ్ల బాలుడు(Boy)పై గురువారం రాత్రి చిరుత(Leopard) దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీటీడీ(TTD), ఫారెస్ట్ అధికారులు(Forest officials) వెంటనే అప్రమత్తమయ్యారు. అందులో భాగంగానే నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు రెండు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. వాటితో పాటు.. 30 కెమెరా ట్రక్స్(Camera Trucks) కూడా ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. అటవీశాఖ అధికారుల ప్రయత్నం ఫలించింది. నిన్న రాత్రి 10:45 గంటలకు చిరుత బోన్ లో పడినట్లు సమాచారం. ఒక్క రోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై టీటీడీ, అటవీ శాఖా అధికారులను భక్తులు(Devotees) అభినందిస్తున్నారు.
✓ఒక్క రోజు వ్యవధిలోనే చిరుతను భందించడం పై టిటిడిని అభినందిస్తున్న భక్తులు pic.twitter.com/qNlr82aEDR
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) June 24, 2023
