చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెంద‌గా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

చిత్తూరు(Chittoor) జిల్లా పీలేరు(Pileru) నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెంద‌గా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కే.వీ. పల్లి(KV Palli) మండలం, మఠంపల్లి(Matampalli) క్రాస్ వద్ద తుఫాన్(Thoofan) వాహనంను లారీ(Lorry) ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మ‌రో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

శ్రీశైల(Srishailam) దర్శనం అనంతరం తిరుమల(Tirumala) దర్శనానికి వెళ్లి తిరుమల దర్శనం జరగకపోవడంతో తిరిగి వెళుతున్న క్రమంలో ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి కలకడ పోలీసులు చేరుకుని మృత‌దేహాల‌ను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయలైన వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి(Tirupathi) రుయా హాస్పిటల్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివ‌రాలు తెలియాల్సివుంది.

Updated On 14 Sep 2023 9:42 PM GMT
Yagnik

Yagnik

Next Story