రెవెన్యూ(Revenue) రాబడి వైసీపీ(YCP) హయాంలో 16.7 శాతం మేర పెరిగింది. అదే టీడీపీ(TDP) హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి(Buggana Rajendranath) అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక అంశాలపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) ఆర్థిక కార్యదర్శికి లేఖ రాశారు.

రెవెన్యూ(Revenue) రాబడి వైసీపీ(YCP) హయాంలో 16.7 శాతం మేర పెరిగింది. అదే టీడీపీ(TDP) హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి(Buggana Rajendranath) అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక అంశాలపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) ఆర్థిక కార్యదర్శికి లేఖ రాశారు. తాను సమ ఉజ్జి కాదని భావిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ అయన లేఖకు సమాధానం ఇచ్చి ఉండక పోవచ్చు. కొందరు కొత్త వాళ్లు కూడా ఆర్థిక అంశాలపై మాట్లాడుతున్నారు. ఎన్నడూ మాట్లాడని గంటా శ్రీనివాసరావు కూడా ఆర్థికపరమైన అంశాలపై మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 3.72 లక్షల అప్పు చేశారనీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా ఏపీ ఏర్పాటు అయినప్పటి నుంచని వారు తెలుసుకోవాలి. యనమల రాసే ప్రతీ లేఖలోనూ ఆయన పేర్కొన్న అంశాలు భిన్నంగా ఉంటున్నాయన్నారు.

ఆర్థిక శాఖ మంత్రిగా మా శాఖ లోని ఆడిట్ చేసిన వాటిని లేదా కాగ్ లెక్కలు అనుసరించి ప్రకటన చేస్తా. టీడీపీ నేతలు అంతా కూర్చుని ఏపీ అప్పు ఎంతో ఒక లెక్క వేసుకుని ఆరోపణ చేస్తే దానికి సమాధానం చెబుతాం. ప్రతీసారి ఓ కొత్త లెక్క చెప్పే ప్రయత్నం చేయొద్దని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత అప్పు చేశామో టీడీపీ తప్పుడు లెక్కలు చెబుతోంది. ఏపీ ఆర్థిక అంశాలపై కాగ్ లెక్కలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలనీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ఏ అంశాలపై శ్వేతపత్రం ఇవ్వాలో ఆమెకే స్పష్టత లేదు. ఎంపీలు కనకమేడల, రఘురామ కృష్ణంరాజు లేఖలపై లేఖలు రాస్తున్నారు. ఆర్థిక మంత్రి తప్పుడు లెక్కలు చెబుతారా..? టీడీపీ హయాంలో 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాటి గురించి ఎందుకు అడగడం లేదు. కార్పొరేషన్ అప్పుల్లో 58 వేల కోట్లు టీడీపీ హయాంలో చేసినవే. స్థూల ఉత్పత్తి , వార్షిక వృద్ధి రేటు, రెవెన్యూ రాబడి లాంటివి ఆర్థిక పరిస్థితికి బెస్ అవుతుంది. సినిమా డైలాగ్‌లా నోటికి వచ్చిన అంకెను టీడీపీ చెప్పుకొస్తోందని బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి తెలిపారు.

టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఖండించారు. గత ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దని తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. ఒకసారి 4 లక్షల కోట్ల మరోసారి 10 లక్షల కోట్ల అప్పు అంటున్నారని దుయ్యబట్టారు. కోవిడ్‌ ఇబ్బందులతోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని తెలిపారు. ‘స్కిల్ స్కామ్‌ జీఎస్టీ వల్ల బయట పడింది. 2018లోనే ఏపీ రాష్ట్రానికి విచారణ చేయమని లేఖ రాశారు. జీఎస్టీ, సెబీ, ఈడీ విచారణ చేసిన స్కామ్‌ ఇది. 2017 నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది. అలాంటి కేసులో సీఐడీ విచారణ చెయ్యకూడదా.? సిమెన్స్ సంస్థలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా..? 5 రోజుల్లో ట్రైనింగ్ సాధ్యమా.? దానిని ట్రైనింగ్ అంటారా.? డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారు? మా హయాంలో 3 నెలల, 5 నెలలు, 4 నెలలు పాటు ట్రైనింగ్ ఇస్తున్నాం. రూ. 370 కోట్లకి డిజైన్ టెక్ ఈరోజుకి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదు. సీమన్స్ కంపెనీ అసలు ఈ గ్రాంట్ ఇన్ కైండ్ అన్న పద్ధతే లేదని చెప్పింది. అనంతపురం జేఎన్టీయూ సెంటర్‌లో లెక్కేస్తే 8 కోట్లు పరికరాలు ఉన్నాయి. ఎంత చూసిన ఈ స్కామ్‌లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదు. పయ్యావుల కేశవ్ కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలి. కోర్టుకి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా? విచారణలో సేకరించిన ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారని పేర్కొన్నారు.

Updated On 2 Nov 2023 7:17 AM GMT
Ehatv

Ehatv

Next Story