కృష్ణ జిల్లా(Krishna District) మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ప‌ట్ట‌ణానికి చెందిన ప్ర‌ముఖ‌ వైద్యురాలిని(Doctor) గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని జవార్ పేట్(Jawahar Pet) పిల్లల ఆసుపత్రిలో విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ వైద్యురాలు మాచర్ల రాధగా(Macharla Radha) గుర్తించారు. రాధ భర్త మాచర్ల లోకనాథ్.

కృష్ణ జిల్లా(Krishna District) మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ప‌ట్ట‌ణానికి చెందిన ప్ర‌ముఖ‌ వైద్యురాలిని(Doctor) గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని జవార్ పేట్(Jawahar Pet) పిల్లల ఆసుపత్రిలో విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ వైద్యురాలు మాచర్ల రాధగా(Macharla Radha) గుర్తించారు. రాధ భర్త మాచర్ల లోకనాథ్. భార్యాభర్తలు ఇరువురు జవార్ పేట్‌లో ఆసుపత్రి నడుపుతున్నారు. మంగళవారం సాయంత్రం భర్త లోకనాథ్.. క్రింది ఫ్లోర్‌లోని క్లినిక్ కు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే రాత్రి 11 గంటల సమయంలో లోకనాథ్.. రాధాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చి భర్త లోకనాథ్‌.. పైకి వెళ్లి చూడగా రాధా రక్తపు మడుగులో పడివుంది. వెంటనే లోకనాథ్ పోలీసులకు సమాచారం అందించాడు.

విషయం తెలుసుకున్న వెంట‌నే బందర్ డీఎస్పీ మాధవరెడ్డి, ఇనగుదురుపేట సీఐ ఉమామహేశ్వర రావు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాక్టర్ రాధ‌ను హత్య చేసిన దుండ‌గులు నగలు తీసుకెళ్లిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. భర్త నుండి వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హ‌త్య విష‌య‌మై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Updated On 26 July 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story