భద్రాద్రి(Bhadradri) కొత్తగూడెం(Kothagudem) జిల్లాలో తండ్రి కొడుకుని గొడ్డలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. వివ‌రాళ్లోకెళితే.. పాత కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియాలో నివాసం ఉంటున్న‌ రాజయ్యకు(Rajaiah) ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు రవి(40) కూలీక‌గా..

భద్రాద్రి(Bhadradri) కొత్తగూడెం(Kothagudem) జిల్లాలో తండ్రి కొడుకుని గొడ్డలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. వివ‌రాళ్లోకెళితే.. పాత కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియాలో నివాసం ఉంటున్న‌ రాజయ్యకు(Rajaiah) ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు రవి(40) కూలీక‌గా.. చిన్న కొడుకు శంకర్(38) ప్రైవేట్ వ్యాన్ డ్రైవర్‌గా ప‌నిచేస్తున్నారు. అయితే.. చిన్న కొడుకు శంకర్ నిత్యం మద్యం సేవించి తల్లితండ్రులను తీవ్ర ఇబ్బందులు పెడుతుంటాడు. కొడుకు పెట్టే ఇబ్బందులు భరించలేక తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలితో తలపై కొట్టడంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రాజయ్య స్వయంగా వ‌న్ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Updated On 1 Aug 2023 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story