అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి దాడిలో ఓ రైతుకి తీవ్రగాయాలయ్యాయి. వివ‌రాళ్లోకెళితే.. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామ శివారులో రైతు యల్లప్పపై ఎలుగుబంటి దాడి చేసింది.

అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి దాడిలో ఓ రైతుకి తీవ్రగాయాలయ్యాయి. వివ‌రాళ్లోకెళితే.. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామ శివారులో రైతు యల్లప్పపై ఎలుగుబంటి దాడి చేసింది. పొలం పనులకు వెళుతున్న రైతు యల్లప్పపై.. ఎలుగు బంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామస్తులు చూసి కేకలు వేయడంతో ఎలుగుబంటి అడవిలోకి పరుగులు తీసింది. రైతు యల్లప్ప పొట్ట భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. యల్లప్పను వెంట‌నే కుటుంబ సభ్యులు 108లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుగు బంట్లు సంచరిస్తున్నాయని ప‌లుమార్లు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకొలేదని గ్రామస్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలుగు బంటి దాడుల నుంచి గ్రామ‌స్తుల‌ను కాపాడాలని వేడుకుంటున్నారు.

Updated On 28 Aug 2023 11:39 PM GMT
Yagnik

Yagnik

Next Story