ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరమైన ఓటమిని చవి చూసింది. తాము ప్రజలకే మంచి చేశామని.. అయినా ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో తెలియడం లేదని అంటున్నారు. ఇక ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా ఓటమి బాధ నుండి బయటకు వస్తూ ఉన్నారు. వైసీపీ లోని ప్రముఖ నేత అయిన రోజా.. నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భాను చేతిలో ఓటమిని చవిచూశారు. ఈ ఎన్నికల్లో రోజా 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


తాజాగా రోజా ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు.
"చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల!
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!" అంటూ తాము చేసిన మంచిని చెప్పుకునే ప్రయత్నం చేశారు రోజా. వైసీపీ నేతలు తాము ఓడిపోయినందుకు ఎలాంటి బాధపడడంలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలకు ఐదేళ్ల కాలంలో మంచే చేశామని చెప్పుకొచ్చారు.


Eha Tv

Eha Tv

Next Story