ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంట‌లకే చేపట్టడంతో పాటు ఆరోజే 96 శాతంకుపైగా ఫించన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంట‌లకే చేపట్టడంతో పాటు ఆరోజే 96 శాతంకుపైగా ఫించన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఫించన్ల పంపిణీపై ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగష్టు నెలకు సంబంధించి 64 లక్షల 82 వేల 52 వివిధ రకాల ఫించన్ల పంపిణీకి రూ.2737.41 కోట్లను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈమొత్తాన్నిబుధవారం మధ్యాహ్నం లోగా డ్రా చేసేందుకు ఎల్డియంలతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కలక్టర్లకు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది 1వ తేదీ ఉద‌యం నుంచి ఇంటింటికి వెళ్ళి 96 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని.. 2వ తేదీ లోపు నూరు శాతం ఫించన్ల పంపిణీనీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని సీఎస్ ఆదేశించారు.

ఫించన్ల పంపిణీకి సంబంధించి జూలై నెలలో పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం జిల్లాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆ సంఘటనలకు సంబంధించి బాధ్యులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిని విధుల నుండి సస్పెండ్ చేసినందున తదపురి క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎస్ ఆదేశించారు.

Eha Tv

Eha Tv

Next Story