పిఠాపురంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు.

పిఠాపురంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జూలై 1న సామాజిక ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం మధ్యాహ్నం చేబ్రోలులో పిఠాపురం జనసేన నేతలతో భేటీ కానున్నారు.

జూలై 2న కాకినాడ కలెక్టరేట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకూ పంచాయితీ, అటవీ కీలక శాఖల రివ్యూ మీటింగ్ ఉంటుంది. అనంత‌రం మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యే, ఎంపీలతో భేటీ ఉంటుంది.

జూలై 3న ఉప్పాడ, యు.కొత్తపల్లిలో ఫీల్డ్ విజిట్ ఉంటుంది. మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ కీలక నేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో వారాహీ భహిరంగ సభ ఉంటుంది. తర్వాత హెలికాఫ్టర్‌లో విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు.

Updated On 1 July 2024 3:58 AM GMT
Eha Tv

Eha Tv

Next Story