రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు

ఏపీ అసెంబ్లీకి సంబంధించి తుది ఫలితాల ప్రకటన మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రారంభమవుతుంది. జూన్ 4న ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 చోట్ల ఏర్పాటు చేసిన 401 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమవుతుందని.. దీని తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (ఈవీఎం) నమోదైన ఓట్లను లెక్కించనున్నారని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని కౌంటింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించిన మీనా, భారత ఎన్నికల సంఘం రాష్ట్రానికి 119 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించిందని చెప్పారు. మే 13న 175 మంది సభ్యులున్న అసెంబ్లీ, మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 3.33 కోట్ల ఓట్లు పోలయ్యాయి. మొత్తం 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోల్ కాగా, 26,473 మంది ఓటర్లు ఇంటి వద్ద ఓటింగ్ చేశారు. అలాగే 26,721 మంది సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానిక్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated On 3 Jun 2024 7:18 PM GMT
Yagnik

Yagnik

Next Story