175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్ల లో అభ్యర్థులు పై ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని

విజయవాడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ సమావేశాల వివరాలను ఆమె తెలియజేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చించామని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితి పై 26 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు తో చర్చించామన్నారు. మ్యానిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామన్నారు.

175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్ల లో అభ్యర్థులు పై ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని వివరించారు దగ్గుబాటి పురంధేశ్వరి. ఈ విషయాలను జాతీయ నాయకత్వానికి వివరిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 2000 మంది వరకు వచ్చారని.. ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మా పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులు ను ఖరారు చేస్తారని వివరించారు. పొత్తు ఉంటే... మా కేంద్ర పెద్దలే ప్రకటిస్తారని తేల్చి చెప్పారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులు జాబితా సిద్దం చేశామన్నారు. మా జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతామని తెలిపారు. మా జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి మా కార్యాచరణ ఉంటుందని దగ్గుబాటి పురంధేశ్వరి తేల్చి చెప్పారు.

Updated On 3 March 2024 10:20 AM GMT
Yagnik

Yagnik

Next Story