ఆదివారం రాత్రి 7.15 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ

ఆదివారం రాత్రి 7.15 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ, అనంతరం పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రులుగా ఎవరెవరు నేడు ప్రమాణం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ వర్గాల సమాచారం మేరకు ఈ రోజు 30 మంది నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలకు కూడా ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది.

మరో వైపు ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి స్పీకర్ పదవి లభించబోతోందంటూ కథనాలు వినిపించాయి. దీనిపై ఆమెను మీడియా ప్రశ్నించగా..ఆమె మౌనంగా వెళ్లిపోయారు. లోక్ సభ స్పీకర్ పదవి ఇవ్వనున్నారట కదా అనే ప్రశ్నకు పురందేశ్వరి మౌనంతోనే సమాధానమిచ్చారు. కేంద్ర క్యాబినెట్ కూర్పు చక్కగా, ఏపీ నుంచి సరైన ప్రాతినిధ్యం లభించిందని, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారని పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు క్యాబినెట్ లో చోటు లభించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు ఎంతో ఉత్తేజం కలిగించే అంశమని అన్నారు. ఏపీలో మేం కూటమిగా పోటీ చేశాం. కేంద్ర క్యాబినెట్ కూర్పు నేపథ్యంలో, టీడీపీ వాళ్లు రెండు పేర్లు ఇచ్చారు... వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగిందని అన్నారు

Updated On 9 Jun 2024 6:25 AM GMT
Yagnik

Yagnik

Next Story