దివంగత ముఖ్య‌మంత్రి రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) వ‌ర్థంతి సంద‌ర్భంగా మ‌హానేత‌కి నివాళులు అర్పించిన‌ట్లు సీడబ్ల్యూసీ స‌భ్యుడు(CWC Member) రఘువీరారెడ్డి(Raghuveera Reddy) తెలిపారు. ఆయ‌న శ‌నివారం మాట్లాడుతూ.. ప్రతీ తెలుగు వాడు ఆ మహనాయకుడుకి నివాళులు అర్పిస్తున్నారని అన్నారు.

దివంగత ముఖ్య‌మంత్రి రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) వ‌ర్థంతి సంద‌ర్భంగా మ‌హానేత‌కి నివాళులు అర్పించిన‌ట్లు సీడబ్ల్యూసీ స‌భ్యుడు(CWC Member) రఘువీరారెడ్డి(Raghuveera Reddy) తెలిపారు. ఆయ‌న శ‌నివారం మాట్లాడుతూ.. ప్రతీ తెలుగు వాడు ఆ మహనాయకుడుకి నివాళులు అర్పిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఎలా అందజేయాలనే తపన ఆయనలో ఉండేదన్నారు.

చాలా మంది నాయకులు చేయలేనిది రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసారని తెలిపారు. మ‌ర‌ణించి 14 సంవత్సరాలైనా ఆయన ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నార‌ని అన్నారు. రైతుల కోసం ఆయన అనేక చర్యలు తీసుకున్నారని.. విదేశాల్లో కూడా రైతుల కోసం అధ్యయనం చేశారని తెలిపారు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా..పేర్లు మార్చి ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని కామెంట్ చేశారు.

Updated On 2 Sep 2023 4:04 AM GMT
Ehatv

Ehatv

Next Story