✕
తిరుమలలో మళ్ళీ భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది.

x
Crowd of devotees increased in Tirumala
తిరుమలలో మళ్ళీ భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. రూ.300 శీఘ్ర దర్శనంకు 4 గంట సమయం పడుతుందని వెల్లడించింది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 నుండి 7 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,811 కాగా.. 34,901 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.19 కోట్లు అని టీటీడీ వెల్లడించింది.

Yagnik
Next Story