ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ 27, 28 తేదీల‌లో తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ప‌ర్య‌ట‌న షెడ్యూల్ విడుద‌లైంది.

ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ 27, 28 తేదీల‌లో తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ప‌ర్య‌ట‌న షెడ్యూల్ విడుద‌లైంది. 27వ తేదీ మ‌ధ్యాహ్నం 3.20 గంట‌ల‌కు ఆయ‌న తాడేప‌ల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన బ‌య‌లుదేరి 3.50 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం విమానాశ్రయం చేరుకుంటారు. అక్క‌డి నుంచి విమానంలో బ‌య‌లుదేరి 4.50 గంట‌ల‌కు రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. అక్క‌డి నుంచి రోడ్డు మార్గాన‌ బ‌య‌లుదేరి ఏడు గంట‌ల‌కు తిరుమ‌ల‌కు చేరుకుంటారు. రాత్రికి అక్క‌డే బ‌స చేశారు.




అనంత‌రం 28వ తేదీ ఉద‌యం 10.20 గంట‌ల‌కు గెస్ట్ హౌస్ నుంచి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి బ‌య‌లుదేరుతారు. శ్రీవారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు. పూజ‌ల అనంత‌రం ఆల‌యం నుంచి 11.30 గంట‌ల‌కు గెస్ట్ హౌజ్‌కు బ‌య‌లుదేరుతారు. ఆపై గెస్ట్ హౌస్ నుంచి రేణిగుంట‌కు బ‌య‌లుదేరుతారు. అక్క‌డి నుంచి విమానంలో బెంగుళూరుకు వెళ్ల‌నున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story