సీఎం వైఎస్‌ జగన్(CM Jagan) రేపు(బుధ‌వారం) తూర్పుగోదావరి(East Godhavari) జిల్లా కొవ్వూరు(Kovuru) పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్‌ నగదు జమచేయనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్(CM Jagan) రేపు(బుధ‌వారం) తూర్పుగోదావరి(East Godhavari) జిల్లా కొవ్వూరు(Kovuru) పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్‌ నగదు జమచేయనున్నారు. ఈ మేర‌కు అధికారులు సీఎం ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి(Thadepally) నివాసం నుంచి బయలుదేరి కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతినగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగం అనంతరం.. జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం నగదు జమచేయనున్నారు. కార్యక్రమం అనంతరం కొవ్వూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated On 23 May 2023 4:53 AM GMT
Ehatv

Ehatv

Next Story