పెత్తందార్ల కూటమి అంతా పేద పిల్లలకు గవర్న­మెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు చెప్పి­స్తుంటే తట్టుకోలేకపోతున్నారని

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో చంద్రబాబు కొనసాగుతున్నారని.. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒక్క రిజర్వేషన్లే కాదు.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో పాటు ఏ అంశమైనా ముస్లిం మైనార్టీల మనోభావాలకు, ఇజ్జత్, ఇమాన్‌కు అండగా నిలబడతామన్నారు సీఎం జగన్. 175 అసెంబ్లీ సీట్లకుగానూ 4 శాతం అంటే ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి పొలిటికల్‌ రిజర్వేషన్లు కూడా తాము కల్పించామని గుర్తు చేశారు.

పెత్తందార్ల కూటమి అంతా పేద పిల్లలకు గవర్న­మెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు చెప్పి­స్తుంటే తట్టుకోలేకపోతున్నారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. పెత్తందారీ భావజాలం ఉన్న వాళ్లు ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయమని అడుగు­తున్నారు. ఈ రూపం మార్చుకున్న అంట­రానితనం మీద మనం చేయా­ల్సిన యుద్ధం ఇంకా చాలా ఉంది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లూ ఇంటింటి అభివృద్ధి, పథ­కాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివని సీఎం జగన్ అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి జరుగుతుందని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్లీ మోసపోవ­డమేనన్నారు సీఎం జగన్.

Updated On 9 May 2024 8:36 PM GMT
Yagnik

Yagnik

Next Story