ఈ నెల 26వ తేదీన‌ సీఎం జగన్‌ చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం కెనాల్‌కు నీటి విడుదల చేయ‌నున్నారు.

ఈ నెల 26వ తేదీన‌ సీఎం జగన్‌(CM Jagan) చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam) పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం కెనాల్‌కు నీటి విడుదల చేయ‌నున్నారు. అనంతరం శాంతిపురం మండలంలో జ‌రిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేర‌కు సీఎంవో అధికారులు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు.

26 వ తేదీ సోమ‌వారం ఉదయం 8.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రామకుప్పం మండలం రాజుపేట చేరుకుంటారు. అక్కడ కుప్పం కెనాల్‌కు నీటిని విడుదల చేసిన అనంతరం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

Updated On 23 Feb 2024 11:08 PM
Yagnik

Yagnik

Next Story