సీఎం వైఎస్‌ జగన్(CM YS Jagan) రేపు తిరుపతి(Tirupati) పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) రెండు రోజుల పర్యటన సందర్భంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో(Renigunta Airport) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్(CM YS Jagan) రేపు తిరుపతి(Tirupati) పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) రెండు రోజుల పర్యటన సందర్భంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో(Renigunta Airport) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. ఈ మేర‌కు అధికారులు షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఆదివారం సాయంతం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన అనంతరం రాత్రికి తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

ఇదిలావుంటే.. ఆదివారం సాయంత్రం ప్ర‌ధాని మోదీ తిరుపతికి చేరుకుంటారు. రాత్రికి ఆయ‌న తిరుమలలో బస చేస్తారు. సోమవారం ఉదయాన్నే శ్రీవారిని దర్శనం చేసుకొని.. 1:30నిమిషాలకు హకీంపేట(Hakeempet) విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తెలంగాణలోని మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కరీంనగర్ బయలుదేరి.. 2:45నిమిషాలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4:40కి హైదరాబాద్ చేరుకొని.. 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోదీ పాల్గొంటారు.

Updated On 25 Nov 2023 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story