సీఎం వైఎస్‌ జగన్(CM Jagan) రేపు తూర్పుగోదావరి(East Godhavari) జిల్లాకు వెళ్ల‌నున్నారు. రాజానగరం(Rajanagaram) ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్‌ సోదరుడు విజయ్‌ గణేష్‌(Vijay Ganesh) మోహన్‌ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ హాజరుకానున్నారు.

సీఎం వైఎస్‌ జగన్(CM Jagan) రేపు తూర్పుగోదావరి(East Godhavari) జిల్లాకు వెళ్ల‌నున్నారు. రాజానగరం(Rajanagaram) ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్‌ సోదరుడు విజయ్‌ గణేష్‌(Vijay Ganesh) మోహన్‌ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ హాజరుకానున్నారు. ఈ మేర‌కు అధికారులు సీఎం ప‌ర్య‌టన‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జ‌గ‌న్‌ తాడేపల్లి(Thadepally) నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువు చేరుకుంటారు. అక్కడ డీబీవీ రాజు లే–అవుట్‌లో జరగనున్న విజయ్‌ గణేష్‌ మోహన్‌ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated On 25 Oct 2023 6:52 AM GMT
Ehatv

Ehatv

Next Story