గృహనిర్మాణశాఖపై సీఎం జగన్‌(Jagan) సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. గడచిన 45 రోజుల్లో హౌసింగ్‌ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇల్లు పూర్తి అయ్యాయ‌ని వివ‌రించారు. రూఫ్‌ లెవల్‌..

గృహనిర్మాణశాఖపై సీఎం జగన్‌(Jagan) సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. గడచిన 45 రోజుల్లో హౌసింగ్‌ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇల్లు పూర్తి అయ్యాయ‌ని వివ‌రించారు. రూఫ్‌ లెవల్‌.. ఆపైన నిర్మాణంలో ఉన్నవి 5.01లక్షల ఇళ్లుగా వెల్ల‌డించారు. త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు పేర్కొన్నారు. బేస్‌మెంట్‌ లెవల్‌ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షలుపైనే ఉన్నాయ‌ని..వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు సీఎంకు వివ‌రించారు.

సీఎం ఆదేశాలమేరకు జగనన్నకు చెబుదాం స్పెషల్‌ ఆఫీసర్లు కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారని అధికారులు వెల్లడించించారు. సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణంలో వాడే మెటీరియల్‌ నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాలమేరకే ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం చేప‌ట్టామ‌ని.. ఇప్పటివరకూ 11.03 లక్షలమందికి రూ. 35 వేల చొప్పున.. రూ. 3886.76 కోట్లమేర పావలా వడ్డీకే రుణాలు అంద‌జేసిన‌ట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. సీఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్లనిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.. వేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్న సీఎం సూచించారు. ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారుల‌ను కోరారు. పేదలకు ఎంతత్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయని సీఎం అన్నారు.

సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు వివ‌రించారు. ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు చేశామని అధికారులు తెలిపారు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. 5,024 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం పేద‌ల‌కు అందించనుంది.

Updated On 18 May 2023 5:06 AM GMT
Ehatv

Ehatv

Next Story